Saturday, April 20, 2024

వైఎస్ఆర్ ను కుట్ర చేసి చంపారు.. షర్మిల సంచలన వ్యాఖ్యలు

వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డిని కుట్ర చేసి చంపారని.. తనను కూడా చంపాలని చూస్తున్నారని ఆమె తెలిపారు. తాను పులి బిడ్డను… తనకు భయం లేదని ఆమె అన్నారు. ఈ బేడీలు తనను ఆపలేవని ఆమె ప్రెస్ మీట్ లో బేడీలు చూపించారు. తనను ఆపడం ఎవరి తరం కాదన్నారు. మీకు పోలీసులుంటే.. తనతో జనం ఉన్నారన్నారు. దమ్ముంటే తనను అరెస్ట్ చేయండి అని ఆమె అన్నారు. కేసులు పెట్టారు కదా… అరెస్ట్ చేయండి చూద్దామని సవాల్ విసిరారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement