Friday, April 19, 2024

రామన్న రాజ్యంలో రాజన్న కూతురు!

తెలంగాణలో కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేయనున్న వైఎస్ షర్మిల పక్కా వ్యూహంతో ముందుకు సాగుతున్నారు. తెలంగాణలో రాజన్న రాజ్యమే లక్ష్యం అంటూ ప్రజల్లోకి వెళ్తున్నారు. రైతులు, నిరుద్యోగం తదితర అంశాలపై ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. శుక్రవారం మంత్రి కేటీఆర్ నియోజకవర్గం సిరిసిల్లలో పర్యటించనున్నారు. ప్రజా సమస్యలు తెలుసుకోవడంలో భాగంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా పర్యటనకు వెళ్తూ.. మార్గమధ్యలో ఒంటిమామిడి, ప్రజ్ఞపూర్ గ్రామాల్లోని వైఎస్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. షర్మిల టూర్ నేపథ్యంలో సర్వత్ర టెన్షన్ వాతావరణం నెలకొంది.

మాజీ వైఎస్ జయంతి సందర్భంగా జూలై 8న కొత్త రాజకీయ పార్టీని షర్మిల ప్రారంభించబోతున్నారు. పార్టీ విధివిధానాలు, జెండా, అజెండాను కూడా ఆరోజే ప్రకటిస్తారు. అందుకు తగ్గట్లు ఏర్పాటు కూడా చేస్తున్నారు. మరోవైపు తెలంగాణ ప్రభుత్వంపై తరచు విమర్శలు చేస్తూ వార్తల్లో ఉంటున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్ష పార్టీల కంటే తామకే టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఎదుర్కొనే సత్తా ఉందనే సంకేతాన్ని ప్రజల్లో పంపుతున్నారు. ఈ క్రమంలోనే షర్మిల వరుసగా జిల్లాల పర్యటనకు శ్రీకారం చూట్టారు. ఇటీవల వికారాబాద్, సూర్యపేట జిల్లాల్లో పర్యటించారు. శుక్రవారం మంత్రి కేటీఆర్ నియోజకవర్గమైన సిరిసిల్లలో షర్మిల పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా పలువురు నిరుద్యోగులను పరామర్శించనున్నారు.

ఇదీ చదవండి: వాసాలమర్రిలో 18 మందికి అస్వస్థత..

Advertisement

తాజా వార్తలు

Advertisement