Thursday, April 25, 2024

ప్రజలారా మేల్కోండి.. కేసీఆర్ ప్లాన్ పై షర్మిల సెటైర్లు

టీఆర్ఎస్ ఇప్పుడు ఉద్యమ పార్టీ కాదని, పూర్తిగా రాజకీయ పార్టీ అని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేసిన నేపథ్యంలో వైఆర్ఎస్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల స్పందించారు. టీఆర్ఎస్ ఫక్తు రాజకీయ పార్టీ అని కేసీఆర్ అంగీకరించారని షర్మిల అన్నారు. ఎన్నికల్లో గట్టెక్కేందుకు ఏదో ఒక పథకాన్ని తీసుకొస్తాం తప్ప… ప్రజల అభివృద్ధి మాత్రం మాకు పట్టలేదు అని చెప్పినందుకు చాలా సంతోషమంటూ ఆమె సెటైర్లు వేశారు. జనాలను మోసం చేస్తూ గెలుస్తున్నామని ఇప్పటికైనా చెప్పినందుకు సంతోషమని ఎద్దేవా చేశారు. టీఆర్ఎస్ పాలనలో ఎన్నికలు ఉంటేనే పథకాలు వస్తాయని, ప్రాంతాల అభివృద్ధి జరుగుతుందని… ఈ విషయాన్ని ప్రజలు ఇప్పటికైనా గమనించాలని షర్మిల సూచించారు. కాబట్టి మీ ప్రాంతం అభివృద్ధి చెందాలంటే మీ నియోజకవర్గ టీఆర్ఎస్ ఎమ్మెల్యేల చేత రాజీనామా చేయించాలంటూ ప్రజలకు ఆమె పిలుపునిచ్చారు. ఉపఎన్నికలు వస్తే కేసీఆర్ దృష్టి మీ ప్రాంతంపై పడుతుందని, ఎన్నికల్లో గెలిచేందుకు కొత్త పథకాలను తీసుకొస్తారని అన్నారు. ఎన్నికల్లో గెలిచాక హామీలను మళ్లీ మూలకు పడేస్తారని షర్మిల విమర్శించారు.

ఇది కూడా చదవండి: సహాయక చర్యలు చేపట్టండి: వరదలపై కలెక్టర్లకు సీఎస్ కీలక సూచన

Advertisement

తాజా వార్తలు

Advertisement