Thursday, April 25, 2024

Breaking: ఏపీలోనూ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ?: వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు

వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. మీడియాతో చిట్ చాట్ సందర్భంగా.. ఏపీలో పార్టీ పెడుతున్నారా అని అడిగిన ప్రశ్నకు స్పందించిన షర్మిల.. రాజకీయ పార్టీ ఎక్కడైనా పెట్టొచ్చు అని వ్యాఖ్యానించారు.  పెట్టకూడదని రూల్ ఏం లేదు కదా అని ప్రశ్నించారు. తాము ఒక మార్గాన్ని ఎంచుకున్నామన్నారు. ఈ నెల 19 లేదా 20 నుంచి పాదయాత్రకు సన్నహాలు చేస్తున్నట్లు వెల్లడించారు.

రైతు ఆవేదన యాత్రకి అనుమతి ఇవ్వడం లేదన్నారు. నిబంధనల ప్రకారం పోతాము అని చెప్పినా అనుమతి ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు బంధు పండుగలకు మాత్రం నిబంధనలు అడ్డు రావని ఎద్దేవా చేశారు. ప్రతిపక్షాల గొంతు నొక్కెందుకే నిబంధనలు పెడుతున్నారన్న షర్మిల.. బీజేపీ, కేసీఆర్ దొందు దొందే అని వ్యాఖ్యానించారు. ఇష్యూ డైవర్ట్ చేసేందుకు బీజేపీని కేసీఆర్ టార్గెట్ చేస్తున్నారని షర్మిల ఆరోపించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement