Wednesday, April 24, 2024

పార్టీలోకి వస్తారా?: ఈటలకు వైఎస్ షర్మిల ఆహ్వానం

మాజీ మంత్రి ఈటల త్వరలో బీజేపీలో చేరేందుకు సిద్ధమవుతున్న వేళ.. వైఎస్ షర్మిల తమ పార్టీలోకి ఆహ్వానించారు. ఈటల వస్తానంటే ఆహ్వానిస్తామని ఆమె అన్నారు. పార్టీ నాయకులతో లోటస్ పాండ్‌లో బుధవారం షర్మిల సమావేశం నిర్వహించారు. కేసులకు భయపడి ఈటల బీజేపీలో చేరుతున్నారని ఆమె అన్నారు. టీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చే వారిపై కేసులు పెట్టడం కామన్ అని వ్యాఖ్యానించారు. కేసులకు భయపడి బీజేపీలో చేరడం కూడా కామన్ అయిపోయిందన్నారు. తమ పార్టీలోకి ఈటల వస్తానంటే ఆహ్వానిస్తామని షర్మిల పేర్కొన్నారు. ఇప్పటి వరకు ఈటల విషయంలో తమ పార్టీలో ఎటువంటి చర్చ లేదని చెప్పారు.

రాజశేఖర్ రెడ్డి పేరుతోనే వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఉంటుందన్నారు. టేబుల్ ఫ్యాన్ గుర్తుపై ప్రచారాన్ని ఆమె ఖండించారు. అదంతా ఫూలిష్ ప్రచారం జరుగుతోందన్నారు. ఇప్పటి వరకు గుర్తు ఎంపికపై ఎటువంటి చర్చ జరగలేదన్నారు. ప్రజలకు ఏం కావాలో తెలుసుకొని పార్టీ విధి,విధానాలు రూపొందిస్తామన్నారు. ప్రజల అజెండాను తమ పార్టీ అజెండా అని షర్మిల స్పష్టం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement