Thursday, March 28, 2024

కేటీఆర్ ఇలాకాలో షర్మిల నిరాహార దీక్ష

రాజన్న సిరిసిల్ల జిల్లాలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల నిరుద్యోగ నిరాహార దీక్ష చేపట్టారు. ప్రతి మంగళవారం నిరుద్యోగ దీక్షలో భాగంగా ఇవాళ వేములవాడ నియోజకవర్గంలో దీక్ష చేస్తున్నారు. ఇటీవల రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఆత్మహత్య చేసుకున్న నిరుద్యోగి మహేందర్ యాదవ్ కుటుంబాన్ని పరామర్శించిన వైఎస్ షర్మిల.. అతడి కుటుంబసభ్యులను ఓదార్చారు. అనంతరం అదే గ్రామంలో నిరుద్యోగ నిరాహార దీక్ష చేపట్టారు. తన తండ్రి విగ్రహానికి పూలమాల వేసిన అక్కడే ఒక రోజు నిరుద్యోగ నిరాహార దీక్ష చేపట్టారు. 

తెలంగాణలో నిరుద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించాలని రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేస్తానని షర్మిల ప్రకటించారు. ప్రతి మంగళవారం నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించాలనే డిమాండ్ తో నిరాహార దీక్షకు శ్రీకారం చుట్టారు. అందులో భాగంగానే ఇవాళ రాజన్న సిరిసిల్ల జిల్లాలో దీక్ష చేస్తున్నారు.  గత మంగళవారం ఉమ్మడి నల్గొండ జిల్లా చండూరు మండలం పుల్లెంలలో దీక్ష చేశారు. పుల్లెంల గ్రామంలో ఆత్మహత్య చేసుకొన్న నిరుద్యోగి  శ్రీకాంత్ కుటుంబాన్ని షర్మిల తొలుత పరామర్శించారు. శ్రీకాంత్ కుటుంబానికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement