Tuesday, April 16, 2024

క‌రోనాని ఆరోగ్య శ్రీలో చేర్చండి .. ష‌ర్మిల విజ్ఞ‌ప్తి ..

ఆరోగ్య శ్రీ ద్వారా క‌రోనాకి వైద్యం ఉచితంగా అందేలా చూడాల‌ని వైఎస్ ఆర్ టీపీ అధ్య‌క్షురాలు షర్మిల తెలిపారు. క‌రోనా సెకండ్ వేవ్ లో డాక్ట‌ర్లు ఉంటే బెడ్స్ లేక.. బెడ్స్ ఉంటే ఆక్సిజ‌న్ లేక జ‌నం అల్లాడార‌ని టిఆర్ ఎస్ పార్టీపై మండిప‌డ్డారు. కార్పొరేట్ ఆసుపత్రుల దోపిడీని అరికట్టాల‌న్నారు. ప్రతి ఒక్కరికి కరోనా రెండు డోసులు వ్యాక్సిన్ అందేలా చెయ్యాల‌ని కోరారు. గతంలో కరోనాతో ఇల్లు గుల్లయిన కుటుంబాలకు కరోనా వైద్య బిల్లులు చెల్లించండి’ అని ష‌ర్మిల కోరారు. పారాసిట‌మ‌ల్ ట్యాబ్ లెట్ వేసుకుంటే స‌రిపోతుంద‌ని ప్ర‌జ‌ల ప్రాణాల‌ను గాలికి వ‌దిలేశార‌న్నారు. క‌నీసం ఇప్పుడైనా దొర కేసీఆర్ చేతులు కాలాక ఆకులు ప‌ట్టుకోవ‌ద్ద‌ని సూచించారు. ముంద‌స్తు జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement