Friday, March 29, 2024

హుజురాబాద్ ఉపఎన్నికపై షర్మిల మనసులో మాట!

తెలంగాణలో త్వరలో తాను పాదయాత్ర చేయబోతున్నట్లు వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రకటించారు. వైఎస్ లాగే తాను కూడా చేవెళ్ల నుంచి పాదయాత్ర ప్రారంభిస్తానని షర్మిల వెల్లడించారు. త్వరలో జరిగే హుజురాబాద్ ఉపఎన్నికపై షర్మిల ఆసక్తిక వ్యాఖ్యలు చేశారు. హుజూరాబాద్‌ ఉపఎన్నికకు అర్థమే లేదన్నారు. పగలు, ప్రతీకారాల కోసం హుజూరాబాద్ ఉపఎన్నికను తెరపైకి తీసుకువచ్చారని మండిపడ్డారు. ఎన్నికలతో ప్రజలకు ఏమైనా మేలు జరుగుతుందా ? అని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్‌ విఫలమయ్యారని విమర్శించారు. ఆయన తనకొచ్చిన అవకాశాన్ని దుర్వినియోగం చేశారని తెలిపారు. తెలంగాణకు ముఖ్యమంత్రి ఎవరు..? కేసీఆరా.. లేకుంటే ఆయన కొడుకా..? అని ప్రశ్నించారు. ఉద్యమకారుడిగా కేసీఆర్‌పై తనుకు ఎంతో గౌరవం ఉందన్నారు. అయితే, సీఎం అయ్యాక కేసీఆర్‌లోని దొర బయటికొచ్చారని పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement