Friday, March 29, 2024

ఎస్ఐ కావాల్సిన యువ‌కుడు.. ప్రాక్టీస్ చేస్తూ మృతి..

సూర్యాపేట : సబ్ ఇన్ స్పెక్ట‌ర్ కావాల్సిన యువకుడు గుండెపోటుతో అకస్మాత్తుగా మృతిచెందడంతో సూర్యాపేట జిల్లా కేంద్రంలో విషాదఛాయలు అలుముకున్నాయి. సూర్యపేట జిల్లా ఇందిరమ్మ కాలనీకి చెందిన సమర్తపు లక్ష్మయ్య కుమారుడు శ్రీకాంత్ ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన సబ్ ఇన్ స్పెక్ట‌ర్ ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధించాడు. తదుపరి నిర్వహించే శారీరక, దేహదారుడ్య పరీక్షల కోసం జిల్లా కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర డిగ్రీ కళాశాలలో ప్రతి రోజు ఉదయం ప్రాక్టీస్ చేస్తున్నాడు.

రోజు లాగే ఈ రోజు ఉదయం కూడా వాకింగ్ చేస్తుండగా ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. హుటాహుటిన మిత్రులు సూర్యాపేట జిల్లా ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతిచెందినట్లుగా వైద్యులు తెలిపారు. చేతికందిన కుమారుడు త్వరలో ఎస్ఐ గా ఉద్యోగం సంపాదిస్తాడనుకున్న కుమారుడు అకాల మరణం చెందడంతో ఆ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement