Tuesday, April 16, 2024

విజయసాయిరెడ్డిపై RRR ఫైర్.. ఆయన దరిద్రపు ట్వీట్ వల్ల పరువు పోయిందని మండిపాటు

టీడీపీ అధినేత చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన ట్వీట్‌పై వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు మండిపడ్డారు. ప్రత్యర్థిని కూడా గౌరవించాలని రామాయణం చెపుతోందని… చిన్నప్పటి నుంచి అలాంటి గ్రంధాలు చదివి ఉంటే మంచి లక్షణాలు వచ్చుండేవని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘పార్టీ జాతీయ కార్యదర్శివి, రాజ్యసభ సభ్యుడివి, పార్లమెంటులో తమ పార్టీ ఎంపీలందరికీ నాయకుడివి… ఇలా మాట్లాడటమేంటి? అసలు బుద్ధుందా? ఇదేనా సంస్కారం?’ అంటూ మండిపడ్డారు. చంద్రబాబుకు సీఎం జగన్, తాను కూడా చాలా సంస్కారంతో శుభాకాంక్షలు తెలియజేశామని, కానీ విజయసాయిరెడ్డి చేసిన ట్వీట్ దారుణంగా ఉందని అన్నారు. ఇలాంటి సంకుచిత స్వభావాన్ని వీడండని సూచించారు.

చెత్త మాటలు మాట్లాడితే గండపెండేరం తొడుగుతారని విజయసాయి భావిస్తున్నారేమో అని, ఇతరులను గౌరవిస్తేనే, సమాజం గౌరవిస్తుందని RRR హితవు పలికారు. ఆయన చేసే దిక్కుమాలిన ట్వీట్లను సోషల్ మీడియాలో తప్ప, సంస్కారం ఉన్న వాళ్లెవరూ ఇష్టపడరన్నారు. ఆయన చేస్తున్న దిక్కుమాలిన, దగుల్భాజీ ట్వీట్ల వల్ల తటస్థంగా ఉన్న 15 శాతం ఓట్లు పార్టీకి దూరమవుతాయని ఆరోపించారు. విజయసాయి ఇదే పంథాను ఇలాగే కొనసాగిస్తే… పార్టీ జాతీయ కార్యదర్శిగా మరొకరిని జగన్ నియమిస్తే బాగుంటుందన్నారు. విజయసాయిరెడ్డి స్థానంలో సంస్కారం ఉన్న ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు వంటి పెద్దలను నియమించడం బెటర్ అని RRR వ్యాఖ్యానించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement