Friday, April 19, 2024

అద్వానంగా ఉన్న ర‌హ‌దారుల్లో టోల్ ఛార్జ్ లు వ‌ద్దు – ఎమ్మెల్యే రోజా

విజ‌య‌వాడ‌లో రోడ్లు, భ‌వ‌నాల‌శాఖ ప్ర‌త్యేక కార్య‌దర్శి కృష్ణ‌బాబును క‌లిశారు వైసీపీ ఎమ్మెల్యే రోజా. ఈ మేర‌కు చిత్తూరు జిల్లాలోని న‌గ‌రి, పుత్తూరు జాతీయ ర‌హ‌దారి ప‌రిస్థితి దారుణంగా ఉంద‌ని తెలిపారు. తన నగరి నియోజకవర్గం పరిధిలోని తిరుపతి-చెన్నై జాతీయ రహదారి ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పూర్తిగా దెబ్బతిన్నదని రోజా వివరించారు. వెంటనే ఆ రోడ్డుకు మరమ్మతులు చేపట్టాలని కోరారు. అద్వానంగా ఉన్న రోడ్డులో టోల్ ఛార్జీలు వ‌సూలు చేయ‌డం స‌రి కాద‌ని తెలిపారు. ఈ మేరకు కృష్ణబాబుకు వినతిపత్రం అందజేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement