Wednesday, April 17, 2024

టీడీపీ నేత దేవినేని ఉమపై రాళ్ల దాడి

టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు వాహనంపై రాళ్ల దాడి జరిగింది. కృష్ణాజిల్లా జి.కొండూరు మండలం గడ్డమణుగు వద్ద కొండపల్లి అటవీప్రాంతంలో మైనింగ్‌ పరిశీలనకు వెళ్లిన సమయంలో దేవినేనిపై రాళ్లదాడికి పాల్పడ్డారు. మైలవరం వైసీపీ ఎమ్మెల్యే వసంతకృష్ణప్రసాద్‌ అనుచరులే దాడికి పాల్పడ్డారని దేవినేని ఉమా ఆరోపించారు. టీడీపీ, వైసీపీ వర్గాలు ఘటనాస్థలికి చేరుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ దాడిలో పలువురికి గాయాలయ్యాయి. దేవినేనిపై జరిగిన దాడిని టీడీపీ తీవ్రంగా ఖండించింది. దాడికి పాల్పడిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని టీడీపీ నేతలు డిమాండ్ చేశారు. రాళ్ల దాడిలో దేవినేని ఉమా వాహనం ధ్వంసం అయ్యింది. సంఘటన స్థలానికి పోలీసులు చేరుకుని ఇరు వర్గాలను చెదరగొట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement