Thursday, April 18, 2024

Telangana: యాదాద్రి రికార్డు.. ఒక్క రోజులోనే స్వామివారి హుండీకి రూ.1.09 కోట్ల ఆదాయం

తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి ఆలయానికి ఒక్కరోజే భారీగా ఆదాయం సమకూరింది. కార్తిక మాసం కావడంతో భక్తుల రాక పెరిగింది. దీంతో హుండీ ఆదాయం అమాంతం పెరిగిందని అధికారులు తెలిపారు. ఇవ్వాల (ఆదివారం) స్వామివారి హుండీని లెక్కించగా 1,09,82,446 రూపాయలను భక్తులు సమర్పించినట్లు అధికారులు తెలిపారు. ఇంత పెద్ద మొత్తంలో యాదాద్రి లక్ష్మీ నర్సింహస్వామి ఆలయానికి రావడం ఇదే మొదటి సారి అని, రికార్డు కూడా ఇదేనన్నారు.

పవిత్ర కార్తీక మాసం కావడంతో భక్తుల రాక పెరిగిందని, స్వామివారిని పెద్ద ఎత్తున దర్శించుకున్నారని ఆలయ అధికారులు తెలిపారు. సత్యనారాయణ వ్రతాలు, నిత్య కల్యాణోత్సవాల్లో పాల్గొని భక్తులు తమ మొక్కులు చెల్లించుకున్నట్టు తెలిపారు. దీంతో స్వామివారి ఖజానాకు భారీగా ఆదాయం సమకూరినట్టు వెల్లడించారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement