Wednesday, April 24, 2024

యాదాద్రి ల‌క్ష్మిన‌రసింహస్వామిని ద‌ర్శించుకున్న సీఎం కేసీఆర్

యాదాద్రి ల‌క్ష్మిన‌ర‌సింహ‌స్వామిని సీఎం కేసీఆర్ మంగ‌ళ‌వారం ద‌ర్శించుకున్నారు. బాలాల‌యంలో స్వామి వారిని ద‌ర్శించుకున్న అనంత‌రం కేసీఆర్‌తో పాటు ప‌లువురు నాయ‌కుల‌ను వేద పండితులు ఆశీర్వ‌దించారు.

ముఖ్య‌మంత్రి కేసీఆర్ వెంబ‌డి మంత్రులు ఇంద్ర‌క‌రణ్ రెడ్డి, జ‌గ‌దీశ్ రెడ్డి, మ‌ల్లారెడ్డి, మండ‌లి మాజీ చైర్మ‌న్ గుత్తా సుఖేంద‌ర్ రెడ్డి, ఎమ్మెల్యేలు గొంగిడి సునీత‌, గ్యాద‌రి కిశోర్, పైళ్ల శేఖ‌ర్ రెడ్డి, మ‌ర్రి జ‌నార్ధ‌న్ రెడ్డి, టీఆర్ఎస్ నాయ‌కులు మోత్కుప‌ల్లి న‌ర్సింహులు ఉన్నారు.

మ‌ధ్యాహ్నం యాదాద్రికి చేరుకున్న సీఎం కేసీఆర్.. ఏరియ‌ల్ వ్యూ ద్వారా ఆల‌య ప‌రిస‌రాల‌ను ప‌రిశీలించారు. ఆ త‌ర్వాత కాన్వాయ్‌లో ఘాట్ రోడ్డు ద్వారా కొండ‌పైకి చేరుకున్నారు. పూర్తికావస్తున్న పుణ్యక్షేత్రం పునర్నిర్మాణ పనులను పరిశీలించిన అనంత‌రం ఆలయ పునఃప్రారంభ ముహూర్తాన్ని సీఎం ప్ర‌క‌టించ‌నున్నారు. ఆలయ పునఃప్రారంభ ముహూర్తాన్ని ఇప్పటికే చినజీయర్‌స్వామి ఖరారు చేశారు. ఆ వివరాలను మ‌ధ్యాహ్నం 3:30 గంట‌ల‌కు మీడియాకు సీఎం తెలియజేస్తారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement