Saturday, April 20, 2024

ప్ర‌ధాని మోడీకి ర‌క్తంతో లెట‌ర్ – ఎస్సై పోస్టుల భ‌ర్తీలో అక్ర‌మాలు

ప్ర‌ధాని న‌రేంద్ర మోడీకి ర‌క్తంతో లెట‌ర్ రాశారు. క‌ర్ణాట‌క‌లో ఎస్సై పోస్టుల భ‌ర్తీలో అక్ర‌మాలు జ‌రిగాయ‌ని ప‌లువురు అభ్య‌ర్థులు ఈ లేఖ‌ని రాయ‌డం విశేషం. రాష్ట్రంలో జరిగిన ఎస్సై పోస్టుల భర్తీలో అక్రమాలు జరిగాయని, దీనిపై సమగ్రంగా విచారించాలని, అక్రమాలకు పాల్పడిన వారిని శిక్షించాలని అందులో డిమాండ్ చేశారు. అక్రమ మార్గంలో ఎస్సై పోస్టుకు ఎంపిక కావాలనుకున్న వారి వల్ల కష్టపడి చదివి, పరీక్షల్లో ఎంపికైన వారి పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని, వారికి అన్యాయం జరగకుండా చూడాలని ఆ లేఖలో అభ్యర్థులు కోరారు. ప్రధానమంత్రి మోడీపై తమకు అపారమైన గౌరవం ఉందని, దీనిపై స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు. రాష్ట్రంలో డబ్బులున్న వారికే ప్రభుత్వ ఉద్యోగమన్న విధానం వచ్చేసిందని ఆవేదన వ్యక్తం చేసిన అభ్యర్థులు, దీనివల్ల తాము మానసికంగా చచ్చిపోయామని అన్నారు. అంతేకాదు, ఉద్యోగాల్లో తమకు అన్యాయం చేరితే నక్సల్స్‌లో చేరుతామని కూడా ఆ లేఖలో హెచ్చరించారు. మొత్తం ఎనిమిది మంది లేఖ రాశామని అందులో పేర్కొన్నప్పటికీ వారి పేర్లు కానీ, ఫోన్ నంబర్లు కానీ లేకుండా జాగ్రత్త పడ్డారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement