Wednesday, April 24, 2024

శివ‌రాత్రి సంద‌ర్భంగా ‘స‌ర్కారు వారి పాట’ నుండి పోస్ట‌ర్ రిలీజ్

పొలిటిక‌ల్ అండ్ మాస్ బ్యాక్ డ్రాప్ లో తెర‌కెక్కుతోన్న చిత్రం స‌ర్కారు వారి పాట‌. ఈ చిత్రంలో సూప‌ర్ స్టార్ మ‌హేశ్ బాబు, కీర్తి సురేష్ జంట‌గా న‌టిస్తున్నారు. కాగా ఈ చిత్రాన్ని ప‌ర‌శురాం తెర‌కెక్కిస్తున్నాడు. ఈ సినిమాకు నవీన్ ఎర్నేని, వై రవి శంకర్ , గోపి ఆచంట నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కుతోంది. ఉగాది కానుకగా ఏప్రిల్‌ 1 వ తేదీన సర్కారు వారి పాట సినిమాను విడుదల చేయనున్నారు. సర్కారు వారి పాట నుంచి అదిరిపోయే పోస్టర్ ని రిలీజ్ చేసింది చిత్ర బృందం. ఈ అప్టేడ్‌ తో మహేష్‌ ఫ్యాన్స్‌ ఖుషీ అవుతున్నారు. మహా శివరాత్రి పండుగ నేపథ్యంలో ఈ పోస్టరు ను విడుదల చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement