Friday, April 19, 2024

డిసెంబ‌ర్ 7 నుంచి పార్ల‌మెంట్ శీతాకాల స‌మావేశాలు.. 23 రోజుల‌పాటు నిర్వ‌హ‌ణ‌

డిసెంబ‌ర్ 7వ తేదీ నుంచి పార్ల‌మెంట్ శీతాకాల స‌మావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ మేర‌కు పార్ల‌మెంట‌రీ వ్య‌వ‌హారాల శాఖ మంత్రి ప్ర‌హ్లాద్ జోషి ఈ విష‌యాన్ని ట్వీట్ ద్వారా తెలియ‌జేశారు. డిసెంబ‌ర్ 7 నుంచి 29వ తేదీ వ‌ర‌కు పార్ల‌మెంట్ స‌మావేశాలు కొన‌సాగుతాయ‌ని పేర్కొన్నారు. 23 రోజుల పాటు జ‌రిగే ఈ స‌మావేశాల్లో ప‌లు బిల్లులు, అంశాల‌పై చ‌ర్చిస్తామ‌న్నారు. నిర్మాణాత్మ‌క చ‌ర్చ కోసం ఎదురుచూస్తున్నామ‌ని ఆయ‌న పేర్కొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement