Wednesday, March 27, 2024

బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ కు కరోనా

బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ రెండోసారి కరోనా వైరస్ బారినపడ్డారు. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. కొవిడ్ సోకడంతో ఈ నెల 17న ప్రారంభం కానున్న కేన్స్ ఫిలిం ఫెస్టివల్‌కు దూరమైనట్టు తెలిపారు. కేన్స్ 2022 కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న తనకు కరోనా సోకిందని, దీంతో విశ్రాంతి తీసుకుంటున్నానని పేర్కొన్నారు. కేన్స్‌ను తాను నిజంగా మిస్సవుతున్నానని, కేన్స్‌ ఫెస్టివల్‌లో పాల్గొనే భారత బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. మరోవైపు అక్షయ్ కుమార్ నటించిన ‘పృథ్వీరాజ్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. గతేడాది ఏప్రిల్‌లో అక్షయ్ తొలిసారి కరోనా బారినపడిన సంగతి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement