Friday, April 19, 2024

త్వరలో బీజేపీలో భారీ చేరికలు: ఈటల

దక్షిణ భారత దేశంలో తెలంగాణలో బీజేపీని విస్తరించేందుకు బీజేపీ చేస్తున్న ప్రయత్నానికి పూర్తి సహకారం అందిస్తామని మాజీ మంత్రి ఈటల రాజేందర్ చెప్పారు. సోమవారం ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో ఈటల బీజేపీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీలోకి స్వాగతం పలికి పార్టీలో చేర్చుకున్న నాయకులందరికీ ఈటల రాజేందర్ ధన్యవాదాలు తెలిపారు. విశ్వాసాన్ని వమ్ము చేయకుండా తెలంగాణ ప్రజల కోసం పని చేస్తానని ఈటల రాజేందర్ తెలిపారు. తెలంగాణలో బీజేపీని అన్ని గ్రామాలకు తీసుకొని వెళ్ళడానికి శ్రమిస్తానని తెలిపారు. తెలంగాణలో బీజేపీకి అధికారంలోకి తీసుకొచ్చేందుకు కృషి చేస్తానన్నారు. రానున్న కాలంలో అన్ని జిల్లాల నుంచి బిజెపిలోకి చేరికలు కొనసాగుతాయని ఈటల స్పష్టం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement