Thursday, April 18, 2024

Braking: భార్య‌, పిల్ల‌ల‌ను చంపి భర్త ఆత్మ‌హ‌త్య

భార్య‌, ఇద్ద‌రు పిల్ల‌ల‌ను చంపి, ఆ త‌ర్వాత తండ్రి ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ్డ ఘ‌ట‌న త‌మిళ‌నాడు రాష్ట్రంలో చోటుచేసుకుంది. త‌మిళ‌నాడు రాష్ట్రంలోని నాగ‌ప‌ట్నం జిల్లాలో కూతురు కులాంత‌ర వివాహం చేసుకోవ‌డంతో తీవ్ర మ‌న‌స్తాపానికి గురైన ఓ తండ్రి త‌న భార్య‌, ఇద్ద‌రు పిల్ల‌ల‌ను చంపి ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. ల‌క్ష్మ‌ణ్ అనే వ్య‌క్తికి భార్య‌, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. ల‌క్ష్మ‌ణ్‌ జీవ‌నోపాధి కోసం టీ షాపు నిర్వ‌హిస్తున్నాడు. అయితే ఈయ‌న పెద్ద కుమార్తె ఎస్సీ సామాజిక వ‌ర్గానికి చెందిన యువ‌కుడిని వివాహం చేసుకుంది. దీంతో తీవ్ర మ‌న‌స్తాపానికి గురైన తండ్రి.. త‌న భార్య‌, ఇద్ద‌రు పిల్ల‌ల‌ను చంపేశాడు. అనంత‌రం అత‌ను కూడా ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. ల‌వ్ మ్యారేజ్ చేసుకున్న పెద్ద కుమార్తె త‌న భ‌ర్త‌తో వేరే ప్రాంతంలో నివ‌సిస్తోంది. విష‌యం తెలుసుకున్న కుమార్తె బోరున విల‌పించింది. ఈ ఘ‌ట‌న పై పోలీసులు కేసు నమోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement