Friday, April 19, 2024

We Are Worried | ఎందుకిలా?, మీకేమనిస్తలేదా.. అమిత్​షాకు కపిల్​ సిబల్​ ప్రశ్నలు!

‘‘దేశంలో ఏం జరుగుతోంది? ఎందుకులా చేస్తున్నారు? ఉత్తర ప్రదేశ్​ రాష్ట్రంలో ఆ కాల్చివేతలు ఏంటి? అమిత్​షా గారూ మీకేమీ అనిపిస్తలేదా? మాకైతే భయంగా ఉంది”అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు సీనియర్​ అడ్వొకేట్​, రాజ్యసభ సభ్యుడు కపిల్​ సిబల్​. ట్విట్టర్​ వేదికగా కేంద్ర హోం మంత్రి అమిత్​షా దృష్టికి పలు అంశాలను తీసుకెళ్లారు. 2017 నుంచి 2022 వరకు పోలీసు కస్టడీలో 41 మంది చనిపోయారని పేర్కొన్నారు.

అంతేకాకుండా ఈ మధ్య కాలంలో ..

  1. పోలీసు కస్టడీలో ఉండగానే లక్నో కోర్టులో జివా అనే అతడిని కాల్చి చంపేశారు..
  2. పోలీసు కస్టడీలో ఉండగానే అతిఖ్​, అశ్రఫ్​ని కాల్చి చంపేశారు..
  3. తిహార్​లో తుల్లు తాజ్​పురియాని కాల్చి చంపేశారు..

‘‘అమిత్​ జీ.. ఆర్​ యూ నాట్​ వర్రీడ్​..? కానీ, మాకు భయమైతాంది!!’’

అంటూ యూపీలో జరుగుతున్న దారుణాలను ట్విట్టర్​లో ప్రశ్నించారు కపిల్​ సిబల్..

ఈ ట్వీట్​పై వేలాది మంది రెస్పాండ్​ అవుతున్నారు. లైకులు, షేర్​లతో ప్రభుత్వ తీరును ప్రశ్నిస్తున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement