Thursday, April 25, 2024

మూడు రాజ‌ధానులు ఏర్పాటు చేసి తీరుతాం – మంత్రి బొత్స‌

ఎవ‌రెన్ని చెప్పినా మూడు రాజ‌ధానులు ఏర్పాటు చేస్తామ‌ని స్ప‌ష్టం చేశారు మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ‌. విజ‌య‌న‌గరంలో అధికారుల స‌మీక్ష‌లో ఆయ‌న మాట్లాడారు. ప్రత్యేకహోదా అంశంపై స్పందించారు. ప్రత్యేక హోదా అంశం అప్పటి విభజన చట్టంలో ఉందని స్పష్టం చేశారు. ఈ అంశంపై సీఎం జగన్ పలు దఫాలుగా కేంద్రంతో ప్రస్తావిస్తూనే ఉన్నారని వెల్లడించారు. ప్రత్యేకహోదాపై రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ఉద్ఘాటించారు. ఏపీకి ప్రత్యేకహోదాను సాధించేంతవరకు పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. మూడు రాజధానుల నిర్ణయం తమ విధానం అని అన్నారు. పరిపాలనా రాజధాని విశాఖకు వచ్చితీరుతుందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement