Wednesday, April 17, 2024

పాలిటెక్నిక్ విద్యార్థిని అక్షిత ఆత్మ‌హ‌త్య‌కు కార‌ణాలేంటి?.. పోలీసుల‌కు ఫిర్యాదు చేసిన బాలిక‌ తండ్రి

రామాయంపేటకు చెందిన విద్యార్థిని అక్షిత నిజామాబాద్‌లో సూసైడ్ చేసుకుంది. ఓ ప్రైవేట్ పాలిటెక్నిక్ కాలేజీలో చ‌దువుతూ నిన్న (ఆదివారం) రాత్రి హాస్ట‌ల్ బిల్డింగ్ మీద నుంచి దూకి ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డింది. అయితే.. తీవ్ర గాయాలైన అక్షిత‌ను ఆస్ప‌త్రికి తీసుకెళ్లారు. ట్రీట్‌మెంట్ తీసుకుంటూనే ఇవ్వాల (సోమ‌వారం) అక్షిత చ‌నిపోయింది. కాగా, అక్షిత ఆత్మ‌హ‌త్య‌కు గ‌ల కార‌ణాలపై ప‌లు అనుమానాలు వ్య‌క్తం అవుతున్నాయి.

నిజామాబాద్‌లోని విజయ్ ఇంజనీరింగ్ కాలేజీలో పాలిటెక్నిక్ లో ఈసీఈ ఫ‌స్టియ‌ర్ చ‌దువుతుండ‌గా.. మంగళవారం నుంచి రెండో సెమిస్టర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ మ‌ధ్య‌నే జరిగిన మొదటి సెమిస్టర్ లో ఒక సబెక్టు లో అక్షిత పేయిల్ అయిన‌ట్టు తెలుస్తోంది. అదే బెంగతో కొద్ది రోజులుగా ముభావంగా ఉంటోంద‌ని త‌న‌ స్నేహితులు చెబుతున్నారు. అయితే.. అక్షిత తండ్రి ప్రదీప్ మాత్రం మాక్లూర్ పోలీస్టేషన్ లో త‌న కూతురు ఆత్మ‌హ‌త్య విష‌య‌మై ఫిర్యాదు చేశారు. విద్యార్థిని చ‌దువులో వెన‌క‌బాటుతోనే ఆత్మ‌హ‌త్య చేసుకుందా? మ‌రేదైన కార‌ణం ఉందా అన్న విష‌యాలు పోలీసుల ద‌ర్యాప్తులో వెల్ల‌డి కానున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement