Thursday, April 25, 2024

వదినతో లాడ్జికి వెళ్లిన మరిది.. తెల్లారేసరికి ఏమైందంటే..

వివాహేతర సంబంధం ఓ కుటుంబంలో తీరని విషాదాన్ని మిగిల్చింది. వావివరుసలు మరిచి ప్రవర్తించిన ఓ మహిళ (Women) చివరకు ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన తమిళనాడు (Tamilanadu) రాష్ట్రంలో జరిగింది. కళ్లకురిచి జిల్లాకు చెందిన ప్రభు, మంజుకు కొన్నేళ్ల క్రితం పెళ్లైంది. వీరికి ఇద్దరు పిల్లలున్నారు. ఉపాధి నిమిత్తం ప్రభు 2017లో విదేశానికి వెళ్లాడు. అయితే సొంతూళ్లూనే ఉంటున్న ప్రభు తమ్ముడితో మంజు వివాహేతర సంబంధం (Illegal Affair) పెట్టుకుంది.

ప్రభు దేశంలో లేకపోవడంతో వీళ్లిద్దరి ఎంజాయ్ మెంట్ (Enjoyment) కు అడ్డుఅదుపు లేకుండా పోయింది. ఓ రోజు విజయ్ తన వదిన మంజుతో కలిసి సేలం జిల్లా ఏర్కాడ్ కు వెళ్లాడు. తామిద్దరం భార్యభర్తలమని చెప్పి ఓ లాడ్జి (Lodge)లో రూమ్ కూడా తీసుకున్నాడు. ఇద్దరు కలిసి మద్యం తాగారు. ఇదే సమయంలో విజయ్ తన వదినతో ఓ విషయాన్ని చెప్పాడు. జనవరి 23న తాను పెళ్లి చేసుకోబోతున్నానని, ఇకపై ఇలా కలవడం కుదరదని తెలియజేశాడు. దీంతో ఇద్దరి మధ్య మాటా మాటా పెరిగింది.. వాగ్వాదం జరిగింది.

ఆ తర్వాత తెల్లవారుజామున 3 గంటలకు నిద్రలోనుండి లేచిన విజయ్ కు పక్కన మంజు కనిపించలేదు. బాత్రూమ్‌కు వెళ్లి ఉంటుందని భావించాడు. ఎంతసేపటికీ ఆమె బయటకు రాకపోవడంతో కంగారుపడిన విజయ్ డోర్ బద్దలుకొట్టి చూడగా ఉరేసుకుని ఆత్మహత్య(Suicide)కు పాల్పడింది. కాగా, అప్పటికే ఆమె ప్రాణాలు కోల్పోయింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement