Tuesday, April 16, 2024

ఎండలతో అల్లాడుతున్న వారికి తీపికబురు

తెలంగాణలో ఎండలతో అల్లాడుతున్న ప్రజలకు వాతావరణ శాఖ తీపికబురు అందించింది. రాగల మూడు రోజుల్లో ఒకటి, రెండు చోట్ల తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఈ మేరకు గురువారం ఆదిలాబాద్, కొమరంభీం, నిర్మల్, మంచిర్యాల, నిజామాబాద్, కరీంనగర్, కామారెడ్డి, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, వరంగల్ పట్టణ, వరంగల్ రూరల్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, ఖమ్మం మరియు భద్రాద్రి కొతగూడెం జిల్లాలలో అక్కడక్కడ ఉరుములతో కూడిన వర్షంతో పాటు 30 నుండి 40 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. శుక్రవారం నాడు ఈ జిల్లాలలో అక్కడక్కడ ఉరుములతో కూడిన వర్షంతో పాటు ఈదురుగాలులు, వడగళ్ల వర్షం సంభవించే అవకాశం ఉంది. ఇక శనివారం కూడా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షంతో పాటు భారీ ఈదురుగాలులు, వడగళ్ల వర్షం సంభవించే అవకాశముంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement