Wednesday, April 17, 2024

అమెరికాలో ప‌ర్య‌టించండి.. మోడీకి జో బైడెన్ ఆహ్వానం

అమెరికా అధ్య‌క్షుడు జో బైడెన్ అమెరికాలో ప‌ర్య‌టించాల‌ని ప్ర‌ధాని న‌రేంద్ర మోడీకి ఆహ్వానం ప‌లికారు.కాగా ఈ ఆహ్వానాన్ని ప్రధాని మోడీ మన్నించారని, త్వరలోనే ఆ దేశంలో పర్యటిస్తారని తెలిపింది. ఈ ఏడాది సెప్టెంబర్ లో జరగనున్న జి 20 దేశాల శిఖరాగ్ర సదస్సుకు బైడెన్ భారత్ కు రానున్నారు.అదేవిధంగా జూన్, జూలై నెలల్లో అమెరికా ప్రతినిధుల సభ, సెనేట్ సెషన్ లు జరగనున్నాయి. ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని మోడీ పర్యటనకు అనుకూలమైన షెడ్యూల్ ను రూపొందిస్తామని పీఎంవో వివరించింది. ప్రధాని మోడీ 2021 లోనూ అమెరికాలో పర్యటించారు. ఆ సమయంలో వాషింగ్టన్ లో బైడెన్, మోడీల మధ్య తొలి ద్వైపాక్షిక సమావేశం జరిగింది. తాజా ఆహ్వానం మేరకు ఈ ఏడాదిలో మరోమారు మోడీ అమెరికాలో పర్యటించ‌నున్నారు.ఈ పర్యటనలో అమెరికా కాంగ్రెస్ లో మోడీ మాట్లాడతారని సమాచారం. మోడీ గౌరవార్థం అమెరికా అధ్యక్ష భవనంలో బైడెన్ విందు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement