Saturday, April 20, 2024

విశాఖ‌లో కిష‌న్ రెడ్డి..ప‌ర్యాట‌క‌రంగంపై కీల‌క వ్యాఖ్య‌లు..

విశాఖ‌ప‌ట్నానికి చేరుకున్నారు కేంద్ర‌మంత్రి కిష‌న్ రెడ్డి..ఆయ‌న ఏపీలో ప‌ర్య‌టించ‌నున్నారు. ఈ సందర్భంగా ఏపీ బిజెపి నేతలు..కిషన్ రెడ్డికి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విశాఖ పై కీలక వ్యాఖ్యలు చేశారు. రాజధాని విషయంలో సోము వీర్రాజు ప్రకటించి నిర్ణయమే మా నిర్ణయం.. పార్టీ నిర్ణయని పేర్కొన్నారు. దక్షిణ భారతదేశంలోనే విశాఖపట్నానికి పర్యాటక రంగంగా ఎంతో, ప్రాముఖ్యత ఉందని వెల్లడించారు. చాలా కారణాల వల్ల అనుకున్న స్థాయిలో ఇక్కడ పర్యాటక అభివృద్ధి చెందడం లేదని.. కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా కొన్ని ప్రాజెక్టుల మంజూరు చేసిన వాటిని రోజు పరిశీలిస్తామని వెల్లడించారు.. పర్యాటక అభివృద్ధికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల, అధికారులతో చర్చించి మరింతగా అభివృద్ధి చేస్తామన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement