Thursday, March 28, 2024

తిరుపతి ఉప ఎన్నిక.. ఓటింగ్ బహిష్కరణ!

తిరుపతి పార్లమెంట్ నియోజకర్గానికి ఉప ఎన్నిక పోలింగ్ కొనసాగుతోంది. కొన్నిచోట్ల ఈవీఎంల మొరాయించడం వల్ల పోలింగ్ ఆలస్యమైనప్పటికీ.. ఆ తరువాత ప్రారంభమైంది. ఉదయం 9 గంటల వరకు నియోజకవర్గం వ్యాప్తంగా 7.80 శాతం పోలింగ్ నమోదు అయ్యింది.

మరోవైపు ఉపఎన్నికలో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో రెండు చోట్ల గ్రామస్థులు పోలింగ్ బహిష్కరించారు.  మాజీ మంత్రి బొజ్జల స్వగ్రామం ఊరందూరుతో పాటు నారాయణ గ్రామస్థులు ఎన్నికలను బహిష్కరించారు.  శ్రీకాళహస్తి మునిసిపాలిటీలో తమ గ్రామాలను విలీనం ప్రతిపాదనలను గ్రామస్థులు వ్యతిరేకిస్తున్నారు. గ్రామస్థులు పోలింగ్ బహిష్కరించడంతో ఒక్క ఓటరూ రాక ఊరందూరు పోలింగ్ స్టేషన్ బోసిపోయింది. ఇప్పటికీ ఒక్క ఓటు కూడా పోల్ అవ్వని పరిస్థితి నెలకొంది.  ఓటింగ్ బహిష్కరించడమే గాక..తమ గ్రామాన్ని శ్రీకాళహస్తి మునిసిపాలిటీలో కలపడంపై నిరసన తెలిపారు. మున్సిపాలిటీలో తమ గ్రామాన్ని కలపబోమని రాతపూర్వక హామీ డిమాండ్ చేస్తున్నారు.

అయితే ఈ అంశంపై స్థానిక ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి స్పందించారు. ఎన్నికలో అభ్యర్థి నచ్చకపోతే నోటాకి ఓటు వేసుకో వచ్చని, కానీ ఓటింగ్ కి రాకుండా ఉండడం తగదని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఊరందూరును శ్రీకాళహస్తిలో కలిపారని చెప్పారు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత తీసుకున్న నిర్ణయం కాదని తెలిపారు.  గ్రామస్థులు తీసుకున్న నిర్ణయంలో బొజ్జల కుటుంబం చేస్తున్న రాజకీయం కనిపిస్తుందని ఎమ్మెల్యే మధు సూదన్ రెడ్డి ఆరోపించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement