Wednesday, March 27, 2024

యాక్సిడెంట్‌లో వికారాబాద్ ఎస్సై మృతి.. గుడికెళ్లి వస్తుండగా ఘటన..

ప్రొబేషన్ కాలంలో పరిగి పట్టణంలో విధులు నిర్వహించి (పీఎసై) వికారాబాద్ లో ఎస్సై 1 గా విధులు చేరిన శ్రీను నాయక్ శనివారం సాయంత్రం మృతి చెందారు. నల్గొండ జిల్లాకు చెందిన శ్రీను నాయక్ తన పెళ్లి ఉండడంతో గ్రామానికి వెళ్లారు.

నూతన సంవత్సరం సందర్భంగా తన తండ్రితో కలసి సమీపంలోని దేవాలయానికి వెళ్లి పూజలు నిర్వహించుకొని ఆటోలో ఇంటికి వస్తున్న క్రమంలో ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఎస్సై అక్కడికక్కడే చ‌నిపోగా అత‌ని తండ్రికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు గమనించి ఆసుపత్రికి తరలించగా అప్ప‌టికే చ‌నిపోయిన‌ట్టు వైద్యులు తెలిపారు. కాగా, ఎస్​ఐ శ్రీను నాయక్​కు వారం రోజుల క్రితమే పెళ్లి అయినట్టు తెలుస్తోంది. ఈ ప్రమాదంతో ఇరు కుటుంబాల మధ్య విషాదం నెలకొంది. కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement