Thursday, April 25, 2024

భోగి శుభాకాంక్ష‌లు తెలిపిన వెంక‌య్య‌నాయుడు – తెలుగులో ట్వీట్ చేసిన ప్ర‌ధాని మోడీ

భోగి పండుగ శుభాకాంక్ష‌లు తెలిపారు ఉప రాష్ట్ర‌ప‌తి వెంక‌య్య‌నాయుడు. భోగి ప‌ర్వ‌దినం సంద‌ర్భంగా చెన్నై కోట్టూర్ పురంలోని స్వ‌గృహం వ‌ద్ద ఆయ‌న అర్థాంగి ఉష‌మ్మ‌తో క‌లిసి భోగి మంట‌లు వేశారు వెంక‌య్య‌నాయుడు. ఈ సంద‌ర్భంగా అంద‌రికీ భోగి శుభాకాంక్ష‌లని తెలిపారు.
ఈ ప్రత్యేక పండుగ మ‌న స‌మాజంలో ఆనంద‌మ‌య స్ఫూర్తిని పెంపొందింప‌జేయుగాక‌. అంద‌రికీ మంచి ఆరోగ్యం, శ్రేయ‌స్సు చేకూరాల‌ని ప్రార్థిస్తున్నాను’ అని ప్ర‌ధాని మోడీ తెలుగులో ట్వీట్ చేశారు. జ‌నులంద‌రి జీవితాల్లోని అరిష్టాలు తొల‌గిపోయి, ప్ర‌జ‌ల జీవితాల్లో కొత్త వెలుగులు రావాల‌ని కోరుకుంటున్నాను. రాష్ట్ర ప్రజలందరికీ భోగీ పండుగ శుభాకాంక్షలు’ అని తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ పేర్కొన్నారు.

‘మన సంస్కృతి సంప్రదాయాలకు, సొంత గ్రామాలపై మమకారానికి, వ్యవసాయానికి, రైతులకు మనమంతా ఇచ్చే గౌరవానికి ప్రతీక సంక్రాంతి. భోగి మంటలు, రంగవల్లులు, పండుగ తెచ్చే సంబరాలతో ప్రతి ఇంటా ఆనందాలు వెల్లివిరియాలని మ‌న‌స్ఫూర్తిగా కోరుకుంటూ.. ప్రజలందరికీ భోగి, మ‌క‌ర సంక్రాంతి, క‌నుమ శుభాకాంక్ష‌లు’ అని ఏపీ సీఎం జ‌గ‌న్ పేర్కొన్నారు.

‘ప్రజల కష్టాలు భోగిమంటల్లో కాలిబూడిదవ్వాలని… రైతుకు శుభం జరగాలని… తెలుగునాట ప్రతి లోగిలి కొత్త వెలుగులు నింపుకుని భోగభాగ్యాలతో కళకళలాడాలని కోరుకుంటూ… తెలుగు వారందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు’ అని టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడు ట్వీట్ చేశారు.

vi

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement