Friday, April 19, 2024

యూఏఈ రాజుకు నివాళులు అర్పించనున్న ఉపరాష్ట్రపతి

రెండ్రోజుల క్రితం కన్నుమూసిన యూఏఈ అధ్యక్షుడు, అబుదాబి పాలకుడు షేక్ ఖలీఫా బిన్ జాయెద్ అల్ సహ్యాన్ మృతి చెందారు. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం తరఫున అధికారికంగా సంతాపం తెలియజేసేందుకు భారత ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు అబుదాబి బయలుదేరారు. యూఏఈలో ఈరోజు సాయంత్రం దివంగత యూఏఈ అధ్యక్షుడి స్మృతికి నివాళులు అర్పిస్తారు. అనంతరం యూఏఈ తదుపరి అధ్యక్షుడిగా నియమితులైన షేక్‌ మహమ్మద్‌ బిన్‌ జాయెద్ అల్‌ నహ్యాన్‌తోపాటు దివంగత అధ్యక్షుడి ఇతర కుటుంబ సభ్యులను ఉపరాష్ట్రపతి పరామర్శిస్తారు. భారత ప్రభుత్వం తరఫున వారికి సానుభూతిని తెలియజేస్తారు.

నాలుగు రోజుల పర్యటనకోసం ఉపరాష్ట్రపతి హైదరాబాద్ కు వచ్చిన సంగతి విదితమే. అయితే యూఏఈ అధ్యక్షుడి మృతి నేపథ్యంలో భారతదేశం తరఫున నివాళులు అర్పించేందుకు ఉపరాష్ట్రపతి హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో యూఏఈకి బయలుదేరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement