Saturday, April 20, 2024

నిజామాబాద్ లో క్రిటికల్ కేర్ బెడ్స్.. యువరాజ్ కు మంత్రి కృతజ్ఞతలు

కరోనా కష్ట కాలంలో తమ వంతుగా ఎంతో మందికి సాయం చేస్తూ రియల్ హీరోలు అనిపించుకుంటున్న వారిలో మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ ఒకరు. కరోనా బాధితుల కోసం మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ , ఆయన ఫౌండేషన్, యువికెన్ దేశ వ్యాప్తంగా వెయ్యి పడకల్ని ఏర్పాటు చేస్తోంది. దేశవ్యాప్తంగా 1,000 పడకలను ఏర్పాటు చేసే ప్రణాళికలను ప్రకటించిన విషయం తెలిసిందే.

ఈ క్రమంలో తెలంగాణలోనూ కరోనా బెడ్స్ ను ఏర్పాటు చేశారు. యువరాజ్ యూవికెన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 2.5 కోట్ల వ్యయంతో నిజామాబాద్ జిల్లా జనరల్ హాస్పిటల్‌లో 150 క్రిటికల్ కేర్ బెడ్స్ ఏర్పాటు చేశారు. దీంతో వారి బృందం శుక్రవారం మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డిని వేల్పూర్‌లో కలిశారు. ఈ సందర్భంగా క్రికెటర్ యువరాజ్ సింగ్, వారి ఫౌండేషన్ బృందానికి జిల్లా ప్రజల పక్షాన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు మంత్రి వేముల. వారు చేస్తున్న కార్యక్రమాన్ని అభినందించారు. యువరాజ్ సింగ్‌ను ట్యాగ్ చేస్తూ ట్విట్టర్ ద్వారా కూడా అభినందనలు తెలిపారు. మంత్రి వేముల చేసిన ట్వీట్‌పై క్రికెటర్ యువరాజ్ స్పందించారు. యువరాజ్ సింగ్ కృతజ్ఞతలు చెప్తూ ట్విట్టర్లో రిప్లై ఇచ్చారు.

ఇది కూడా చదవండిః శిల్పా శెట్టిని ప్రశ్నించనున్న పోలీసులు..?

Advertisement

తాజా వార్తలు

Advertisement