Saturday, April 20, 2024

ఏపీ అభివృద్ధిని మేం అడ్డుప‌డుతున్నామా?: బొత్సకు మంత్రి వేముల కౌంటర్

ఏపీలో మౌలిక వ‌స‌తులు ఆధ్వాన్నంగా ఉన్నాయంటూ తెలంగాణ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్య‌ల‌పై ఏపీ విద్యా శాఖ మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ కౌంట‌ర్ ఇవ్వడంపై టీఆర్ఎస్ నేతలు తీవ్రంగా స్పందిస్తున్నారు. తాజాగా తెలంగాణ మంత్రి ప్ర‌శాంత్ రెడ్డి కూడా బొత్స వ్యాఖ్య‌ల‌పై విరుచుకుప‌డ్డారు. ఏపీ గురించి కేటీఆర్ వాస్త‌వాలే చెప్పారని అన్నారు. బొత్స కుటుంబం హైద‌రాబాద్‌లోనే ఉంటోందని, బొత్స‌తో పాటు అక్క‌డి నేత‌ల కుటుంబాల‌న్నీ ఇక్క‌డే ఉంటున్నాయని చెప్పారు. మ‌రి మ‌నం జ‌న‌రేట‌ర్ల‌ను వాడుతున్నామా? అని ప్రశ్నించారు. హైద‌రాబాద్‌లో జ‌న‌రేట‌ర్లు వాడుతున్నామ‌న్న వ్యాఖ్య‌ల‌ను బొత్స విజ్ఞ‌త‌కే వ‌దిలేస్తున్నా అని చెప్పారు. ఎందుకంత అక్క‌సుగా మాట్లాడాలని మండిపడ్డారు. ఏపీలో రోడ్లు బాగా లేవు, క‌రెంటుకు ఇబ్బంది ఉన్న‌ద‌ని వారి ముఖ్యమంత్రే చెప్పారని గుర్తు చేశారు. విజ‌య‌వాడ నుంచి స్థిరాస్తి వ్యాపారులు హైద‌రాబాద్ వ‌స్తున్నారని అన్నారు. ఏపీని అభివృద్ధి చేస్తే మేం ఏమైనా అడ్డుప‌డుతున్నామా? అని ప్రశ్నించారు. ఉన్న మాట అంటే ఉలికిప‌డ‌ట‌మెందుకు? అని ప్ర‌శాంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement