Friday, April 19, 2024

మైఖెల్‌ చిత్రంలో వరలక్ష్మీ..!

సందీప్‌ కిషన్‌ బహుభాషా నటుడిగా ఎదిగాడు. తాజాగా యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ చిత్రం “మైఖేల్‌”లో నటిస్తున్నారు. ఇందులో విజయ్‌ సేతుపతి మరో ప్రధాన పాత్రధారి. రంజిత్‌ జయకోడి ఐదు భాషల్లో తెరకెక్కిస్తున్నారు. సందీప్‌ కిషన్‌ సరసన దివ్యాంక కౌశిక్‌ నటిస్తున్నారు. తాజాగా ఈ చిత్రంలో మరో ముఖ్యపాత్రలో వరలక్ష్మీ శరత్‌ కుమార్‌ నటిస్తున్నాట్టు ప్రకటించారు.

ప్రముఖ దర్శకుడు గౌతమ్‌ వాసుదేవ్‌ మీనన్‌ ఈ సినిమాలో విలన్‌గా నటిస్తున్నారు. ఇప్పటికే మొదటి షెడ్యూల్‌ పూర్తయింది.
సందీప్‌ కిషన్‌ పాత్ర ఎంత ఇంటెన్సిటీతో ఉండనుంద‌ట‌. రజింత్‌ జయకోడి ఈ చిత్రానికి విభిన్నమైన స్క్రిప్ట్‌ను సిద్ధం చేశారు. నటీ-నటులకు ఈ చిత్రం స్పెషల్‌గా నిలిచిపోనుంది. నారాయణ్‌ దాస్‌ కే నారంగ్‌ సమర్పణలో భరత్‌ చౌదరి, పుస్కర్‌ రామ్‌ మోహన్‌ రావు కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసంఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్  పేజీల‌ను ఫాలో అవ్వండి..
Advertisement

తాజా వార్తలు

Advertisement