Friday, March 29, 2024

Breaking: పప్పు దానికి కూడా పనికిరాడు: విజయసాయి రెడ్డి ఘాటు వ్యాఖ్య

టీడీపీ అధినేత చంద్రబాబు, ఎమ్మెల్సీ నారా లోకేష్ లపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. చంద్రబాబు కాలంచెల్లిన మైండ్‌సెట్‌తో అక్కడే గిరికీలు కొడుతున్నారని విమర్శించారు. 2004లో ‘అలిపిరి దాడి’పై ఆశ పెట్టుకుంటే ఏం జరిగింది? 2019లో పసుపు, కుంకుమలే రంగు వెలిసిపోయేలా చేశాయి అని పేర్కొన్నారు. దొంగ తానే అయినా కెలికి మరీ లిక్కర్ బ్రాండ్ల లోగుట్టు బైట పెట్టించుకున్నారు. దిక్కు తోచడం లేదు పాపం! అని అన్నారు.

అన్ని ప్రాంతాల అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని, మూడు రాజధానుల అభివృద్ధి కొనసాగుతుందని జగన్ అసెంబ్లీలో చేసిన ప్రకటన పచ్చ బ్యాచ్‌ గుండెల్లో గునపంలా దిగి ఉంటుందని వ్యాఖ్యానించారు. పేల్చిన టపాసులు, పంచిన మిఠాయిల ఖర్చులు వేస్ట్‌ అయ్యాయని అన్నారు. ఒకే రాజధాని నినాదం అంతులేని వ్యథగా మిగిలిపోయినట్టే అని చెప్పారు. నీతిలేని నాయకుడు ఎవరని అడిగితే భవిష్యత్తు తరాలు చంద్రబాబునే చూపిస్తాయని అని విమర్శించారు. అధికార దుర్వినియోగంతో ఆయన చేసినన్ని అరాచకాలు దేశంలో ఎవరూ చేసి ఉండరని అన్నారు. చివరకు ఏకైక పుత్ర రత్నాన్ని మహిళలపట్ల గౌరవం లేని కుసంస్కారిని చేశారని మండిపడ్డారు. పిడకకూ ఒక ప్రయోజనం ఉంటుంది. పప్పు దానికి కూడా పనికిరాడు అని విజయసాయి రెడ్డి విమర్శించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement