Monday, April 15, 2024

అదుపుత‌ప్పి లోయ‌లో ప‌డిన బ‌స్సు-25మంది మృతి

ప్ర‌మాద‌వ‌శాత్తు ఓ బ‌స్సు అదుపుత‌ప్పి లోయ‌లో ప‌డింది.ఈ ఘ‌ట‌న‌లో 25మంది మృతి చెందారు. ఉత్తరాఖండ్‌లోని కోట్‌ద్వార్ జిల్లాలో జరిగిందీ ఈ ఘటన. రిఖ్నింఖల్ బిరోంఖల్ మోటార్ రోడ్డు సమీపంలోని సిమ్ది గ్రామంలో బస్సు అదుపు తప్పి 500 మీటర్ల లోతైన నాయర్ నది లోయలోకి దూసుకెళ్లింంది. బస్సు హరిద్వార్ జిల్లా నుంచి పౌరి జిల్లాలోని బీర్ఖల్ బ్లాక్‌కు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. ప్రమాదంలో 25 మంది చనిపోయినట్టు చెబుతున్నా అధికారులు మాత్రం సంఖ్యలను కానీ, క్షతగాత్రుల వివరాలు కానీ వెల్లడించలేదు. బాధితులు పౌరిలో ఓ పెళ్లికి వెళ్తున్నట్టు పోలీసులు తెలిపారు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న ధుమ్‌కోట్ పోలీసులు సహాయక కార్యక్రమాలు చేపట్టారు. ప్రమాద విషయం తెలిసిన వెంటనే ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి రాష్ట్ర విపత్తుల నిర్వహణ కేంద్రానికి చేరుకున్నారు. ఎస్‌డీఆర్ఎఫ్ బృందాలు ప్రమాద స్థలానికి చేరుకుని స్థానికుల సాయంతో సహాయక కార్యక్రమాలు చేపట్టినట్టు ముఖ్యమంత్రి తెలిపారు. బాధిత కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.ఇప్పటి వరకు 9 మందిని రక్షించినట్టు పోలీసులు తెలిపారు. వీరిలో ముగ్గురిని బిరోంఖల్ ఆసుపత్రికి తరలించినట్టు తెలిపారు. అక్కడి నుంచి ఒకరిని కోట్‌ద్వారా ఆసుపత్రికి రెఫర్ చేయగా, మిగిలిన ఇద్దరి పరిస్థితి నిలకడగా ఉన్నట్టు చెప్పారు. సహాయ కార్యక్రమాలు కొనసాగుతున్నట్టు ల్యాండ్స్‌డౌన్ ఎమ్మెల్యే దిలీప్ సింగ్ రావత్ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement