Thursday, April 25, 2024

తెలంగాణ‌లో క‌న్‌స్ట్ర‌క్ష‌న్ యూనివ‌ర్సిటీ.. ప‌రిశీల‌న‌కు ప్ర‌త్యేక క‌మిటీ: మంత్రి ప్ర‌శాంత్‌రెడ్డి..

నేష‌న‌ల్ అసెస్‌మెంట్ అండ్ అక్రెడిటేష‌న్ కౌన్సిల్ (NAAC) 42వ ఎక్స్క్యూటివ్ కమిటీ సమావేశం శ‌నివారం జ‌రిగింది. దీనికి ముఖ్య అతిథిగా న్యాక్ వైస్ చైర్మన్, మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు. ఆర్ముర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, న్యాక్ అధికారులు హాజ‌ర‌య్యారు. అయితే ఈ భేటీలో ప్ర‌ధానంగా స్టూడెంట్స్ నుంచి క‌న్‌స్ట్ర‌క్ష‌న్ యూనివ‌ర్సిటీ ఏర్పాటు చేయాల‌న్న దానిపై ప‌లు విజ్ఞాప‌ణ‌లు అందాయి. దీని ఏర్పాటుకు గాను ముగ్గురితో కూడిన క‌మిటీ వేసిన‌ట్టు మంత్రి తెఇపారు. ఈ సంద‌ర్భంగా న్యాక్ లో పలు బ్లాక్ లను మంత్రి ప‌రిశీలించారు. శిక్షణ పొందుతున్న విద్యార్థులతో వారి అనుభవాలను అడిగి తెలుసుకున్నారు. కల్పిస్తున్న సౌకర్యాలు, ఉద్యోగ నియామకాలపై సంతృప్తి వ్య‌క్తం చేశారు.

‘‘ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు న్యాక్ అనే సంస్థతో స్కిల్ డేవల్మెంట్ ఇచ్చి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నాం. కొవిడ్ సమయంలో మా న్యాక్ బాగా పని చేసింది. 95 శాతం అచివ్ అయ్యింది. ఈ సందర్భంగా మా సిబ్బందికి అభినందనలు తెలియజేస్తున్నా. పోయిన సంవత్సరం 19 వేల మందికి శిక్షణ ఇచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పించాం. ఈ ఏడాది 20 వేల మందికి శిక్షణ ఇవ్వాలని అనుకుంటున్నాం. నాన్ స్కిల్ వారికి ఒక రకమైన స్కిల్స్, స్కిల్స్ ఉన్న వారికి ప్రాక్టికల్ నాలెడ్జ్ ఇస్తే భవన నిర్మాణ రంగంలో ఉండేలా ప్రోత్సహిస్తున్నాం. న్యాక్ ఆధ్వర్యంలో బీటెక్ చేసిన వారి కోసం ఒక్క సంవత్సరం పీజీ విద్యను అందించాలని నిర్ణయం తీసుకున్నాం.’’ అన్నారు మంత్రి ప్ర‌శాంత్‌రెడ్డి.

‘‘న్యాక్ లో పని చేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులకు స్లాబ్ పెంచేందుకు నిర్ణయం తీసుకున్నాం. ఉద్యోగులకు పీఆర్సీ అంశానికి సంబంధించి సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్తాను. ఈ సమావేశంలో కన్స్ట్రుక్షన్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని అందరు కోరారు. ముఖ్యమంత్రి కూడా న్యాక్ లో కొత్తగా ఏర్పాటు చేసి యువతకు స్కిల్స్ పై శిక్షణ ఇవ్వాలని అంటుంటారు. ఈ యూనివర్సిటీ కి సంబంధించి 3 సభ్యలతో కమిటీ వేశాం. కమిటీ రిపోర్ట్ వచ్చాక యూనివర్సిటీ ఏర్పాటు పై నిర్ణయం ఉంటుంది.’’ అన్నారు మంత్రి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసంఫేస్‌బుక్‌,  ట్విట్టర్   పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement