Thursday, April 18, 2024

Breaking: హైదరాబాద్ చేరుకున్న కేంద్ర హోం మంత్రి అమిత్ షా

కేంద్ర హోం మంత్రి అమిత్ షా హైద‌రాబాద్ చేరుకున్నారు. శ‌నివారం మ‌ధ్యాహ్నం ఢిల్లీలో బ‌య‌లుదేరిన ఆయ‌న కాసేప‌టి క్రితం న‌గ‌రంలోని బేగంపేట విమానాశ్ర‌యంలో దిగారు. ఈ సంద‌ర్భంగా అమిత్ షాకు బీజేపీ తెలంగాణ శాఖ‌కు చెందిన నేత‌లు సాద‌రంగా స్వాగ‌తం ప‌లికారు. ఎమ్మెల్యేలు, ఈటల, రాజాసింగ్, రఘునందన్ రావు, విజయశాంతి, డికే అరుణ తదితరులు అమిత్ షాకు స్వాగతం పలికారు.

కాగా, అమిత్ షా హైదరాబాద్‌లోని CFSL క్యాంపస్‌లో ‘నేషనల్ సైబర్ ఫోరెన్సిక్ లాబొరేటరీ’ ని ప్రారంభించ‌నున్నారు. ఆ త‌ర్వాత తెలంగాణ బీజేపీ కోర్ క‌మిటీ నేత‌ల‌తో అమిత్ షా భేటీ కానున్నారు. అనంతరం తుక్కుగూడ‌లో జ‌ర‌గ‌నున్న బండి సంజ‌య్ పాద‌యాత్ర ముగింపు కార్య‌క్ర‌మానికి హాజ‌ర‌వుతారు. ఆ కార్య‌క్ర‌మం తర్వాత అమిత్ షా ఢిల్లీకి తిరుగు ప‌య‌నం కానున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement