Friday, April 26, 2024

శ్రీశైలానికి అమిత్ షా.. పర్యటన షెడ్యూల్ ఇదే

కేంద్ర హోం మంత్రి తెలుగు రాష్ట్రాల పర్యటనకు వస్తున్నారు. గురువారం ఉదయం 11.15 గంటలకు ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రాయానికి ఆయన చేరుకోన్నారు. అనంతరం బేగంపేట్ విమానాశ్రయం నుంచే హెలికాప్టర్ లో శ్రీశైలంకు వెళ్లనున్నారు. శ్రీశైలంలో భ్రమరాంబిక మల్లికార్జున స్వామిని మధ్యాహ్నం 12.45 నుంచి 1.45 గంటల మధ్యలో ఆయన దర్శించుకోనున్నారు. దర్శనానంతరం శ్రీశైలంలోని గెస్ట్ హౌస్ లో ఆయన భోజనం చేయనున్నారు. అనంతరం హెలికాప్టర్ లో బేగంపేట ఎయిర్ పోర్టుకు మధ్యాహ్నం 2.45 నిమిషాలకు ఆయన చేరుకోనున్నారు. ఆ తర్వాత బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్లనున్నారు. అయితే, అమిత్ షా పర్యటనలో రాజకీయపరమైన ఎలాంటి కార్యక్రమాలు లేవని తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement