Thursday, March 28, 2024

18 ఏళ్లు నిండిన వారికి వ్యాక్సినేషన్: కేంద్రం నిర్ణయం

దేశంలో కరోనా వీర విజృంభణ చేస్తున్న ఈ సమయంలో కేంద్ర ప్రభుత్వం వ్యాక్సినేషన్ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. మే 1 నుంచి 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికీ వ్యాక్సినేషన్ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. మే 1 నుంచి మూడో విడత వ్యాక్సినేషన్‌ను ప్రారంభిస్తున్నట్లు కేంద్రం పేర్కొంది. దేశంలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన జరిగిన సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇందులో భాగంగా మూడో విడత కరోనా వ్యాక్సిన్‌ మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement