Friday, April 19, 2024

సంచార‌జాతిని అవ‌మానించిన థియేట‌ర్ సిబ్బంది…. ఆగ్ర‌హించిన నెటిజ‌న్లు..

చెన్నై – త‌మిళ హీరో శింబు నటించిన పత్తు తల చిత్రం థియేటర్లలో విడుదలైంది. దీంతో చెన్నైలో ఉదయం 8 గంటలకు బెన్‌ఫిట్ షో ప్రదర్శించారు. చూసేందుకు తెల్లవారుజాము నుండే థియేటర్ ముందు గుమిగూడిన అభిమానులు శింబు కటౌట్‌కు పాలాభిషేకం చేసి బాణాసంచా పేల్చి సంబరాలు చేసుకున్నారు. మూవీ చూసేందుకు మ‌హిళ‌లు సైతం పెద్ద ఎత్తున త‌ర‌లివ‌చ్చారు..ఈ నేప‌థ్యంలోనే సంచార జాతి నరిక్కువర్ వర్గానికి చెందిన ఇద్ద‌రు మ‌హిళ‌లు, ఒక బాలుడు రోహిణి థియేటర్‌లో చూసేందుకు డబ్బు చెల్లించి టిక్కెట్లు కొనుగోలు చేశారు. అయితే వారి థియేటర్ గేటు వద్దే అడ్డుకున్నారు సిబ్బంది. టికెట్టు ఉంది అనుమతించాలని ప్రాధేయపడినా నిర్వహకులు కనికరించలేదు. వారికి ప్రవేశం లేదంటూ తిప్పి పంపారు.. అక్క‌డే ఉన్న ప్రేక్ష‌కులు ఈ ఘ‌ట‌న‌ను వీడియో తీసి సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశారు.

ఈ వీడియో చూసిన నెటిజన్లు థియేటర్ ఉద్యోగిపై విమర్శలు గుప్పిస్తున్నారు. చూసేందుకు వచ్చిన వారిని వేధించిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. కాగా, ఈ ఘటన పై సంగీత దర్శకుడు జివి ప్రకాష్ స్పందించారు. జరిగిన దానిపై విచారం వ్యక్తం చేసిన ఆయన వారిని చూసేందుకు అనుమింతించాలన్నారు. టికెట్ ఉన్న థియేటర్ లోకి రానివ్వకపోవడం సరికాదన్నారు. థియేటర్‌లో చూసే విషయంలో అందరూ సమానమేనన్నారు. దీంతో దిగి వచ్చిన థియేటర్ నిర్వహకులు ఆ ముగ్గురికి చూసేందుకు అవకాశం కల్పించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement