Thursday, April 18, 2024

ప్రపంచ రికార్డు సృష్టించిన నాలుగేళ్ల బాలిక

పుస్తక పఠనం కనుమరుగవుతున్న ప్రస్తుత రోజుల్లో యూఏఈలో భారత సంతతికి చెందిన నాలుగేళ్ల బాలిక బేబీ కియారా సరికొత్త రికార్డు సృష్టించింది. కేవలం 105 నిమిషాల్లో 36 పుస్తకాలను చదివి వరల్డ్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డుల్లో స్థానం సంపాదించింది. అతి తక్కువ సమయంలో అనేక పుస్తకాలు చదివి కొత్త రికార్డు సృష్టించిందంటూ ది ఏషియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ అంగీకరించింది. తనకు పుస్తకాల్లో ఉన్న కలర్‌ఫుల్‌ బొమ్మలను చూడడమంటే చాలా ఇష్టమని, అందుకే పుస్తకాలను చదివేందుకు ఎక్కువ ఇష్టపడుతుంటానని బేబీ కియారా చెబుతోంది. డాక్టర్‌ కావడం తన లక్ష్యమని తెలిపింది.

అయితే గడిచిన ఏడాది కాలంలో బేబీ కియారా దాదాపు 200 పుస్తకాలు చదివినట్లు ఆమె తల్లిదండ్రులు చెబుతున్నారు. బేబీ కియారా ఇంట్లోనే కాకుండా బయటకు వెళ్లిన సమయంలోనూ చేతి పుస్తకం తప్పకుండా ఉంటుందని తల్లిదండ్రులు పేర్కొంటున్నారు. ఇంత చిన్న వయసులోనే తమ కూతురు కొత్త రికార్డు సాధించడం ఎంతో ఆనందంగా ఉందని చెప్పారు. కాగా బేబీ కియారా తల్లిదండ్రుల స్వస్థలం చెన్నై. వారిద్దరూ అమెరికాలో ఉన్న సమమంలో బేబీ కియారా జన్మించింది. ఆనంతరం తల్లిదండ్రులు కూతురితో కలిసి అబుదాబికి షిప్ట్‌ అయిపోయారు. అయితే ఇంత చిన్న వయసులో వరల్డ్‌ బుక్‌ రికార్డు సాధించడంపై ప్రతి ఒక్కరు ప్రశంసిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement