Tuesday, April 23, 2024

మాజీ మంత్రి ఈటెల వ్యవహారంపై కాంగ్రెస్‌ పార్టీలో చీలిక

మాజీ మంత్రి, ఎమ్మెల్యే ఈటెల రాజేందర్​ వ్యవహారం.. కాంగ్రెస్​లో కాక రేపింది. తెలంగాణ ఉద్యమంలో పోరాడిన వారందరినీ సీఎం కేసీఆర్​ కక్షగట్టి బయటకు గెంటేస్తున్నారంటూ కాంగ్రెస్​ లీడర్లు ఈటలకు మద్దతుగా నిలిచారు. పీసీసీ చీఫ్​ ఉత్తమ్​ కుమార్​ రెడ్డితో పాటు వర్కింగ్ ​ప్రెసిడెంట్ ​రేవంత్​ రెడ్డి, జీవన్​రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి, దాసోజు శ్రవణ్​, సంపత్​ కుమార్​తో పాటు చాలా మంది లీడర్లు ఈటెలకు మద్దతుగా మాట్లాడారు. టీఆర్ఎస్ పార్టీలోని మంత్రులు, ఎమ్మెల్యేల భూకబ్జాలు, ఆక్రమణలపై పవర్​పాయింట్​ ప్రెజెంటేషన్​ ఇచ్చి మరీ జనాలకు తెలియజేసే ప్రయత్నం చేశారు. అయితే కాంగ్రెస్ పార్టీ హుజూరాబాద్​ నియోజకవర్గ ఇంఛార్జి పాడి కౌశిక్​ రెడ్డి మాత్రం ఈటలకు వ్యతిరేకంగా గొంతెత్తారు. ఆయనపై ఎన్నెన్నో ఆరోపణలు చేశారు. అదే ఇప్పుడు కాంగ్రెస్​లో చీలికకు కారణమైందన్న వాదనలు వినిపిస్తున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement