Thursday, April 25, 2024

రెండు వాయుసేన విమానాలు ఢీ- ముగ్గురు మృతి

రెండు వాయుసేన విమానాలు ఢీకొన‌డంతో ముగ్గురు మృతిచెందిన ఘ‌ట‌న దక్షిణ కొరియాలో చోటుచేసుకుంది. వాయుసేనకు చెందిన రెండు విమానాలు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ముగ్గురు మృతిచెందగా.. మరొకరు గాయపడ్డారు. ఘటన తర్వాత సచియాన్​ నగరానికి సమీపంలో ఉన్న లోయ ప్రాంతంలో ఈ విమానాలు కూలినట్లు అధికారులు వెల్లడించారు. సహాయక చర్యల కోసం మూడు హెలికాప్టర్లు, 20 వాహనాలు సహా పలువురు సిబ్బందిని తరలించినట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రమాదం వల్ల ఘటనాస్థలం వద్ద ఎవరైనా స్థానికులు ప్రాణాలు కోల్పోయారా అనే విషయంపై తమకు ఎలాంటి సమాచారం అందలేదన్నారు. కేటీ-1 మోడల్​కు చెందిన ఈ విమానాలను శిక్షణ కోసం ఉపయోగిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. శిక్షణా సమయంలో గాల్లోనే ఈ ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు. ఈ విమానాల్లో ఇద్దరు మాత్రమే ప్రయాణించగలరని వెల్లడించారు. అయితే ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఈ నేపథ్యంలో మరిన్ని వివరాల కోసం దర్యాప్తును కొనసాగిస్తామని అధికారులు స్పష్టం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement