Tuesday, April 23, 2024

Memorable: వేర్వేరు రైళ్లలో డ్యూటీ.. తండ్రి కొడుకుల సెల్ఫీ ఎంత బాగుందో!

కెమెరాకు చిక్కిన ఈ ఫొటోను బాగా చూడండి.. వేర్వేరు రైళ్లలో జర్నీ చేస్తున్న ఈ ఇద్దరు ఒకే ఫొటోలో సెల్ఫీ దిగడం అనేది చాలా అరుదైన విషయం.. అయితే అంతే ఇంట్రెస్టింగ్​ విషయం ఏంటంటే.. వీళ్లిద్దరూ తండ్రీకొడుకులు కావడం ఇక్కడ మరో స్పెషాలిటీ. ఇప్పుడీ ఫొటో సోషల్​ మీడియాలో తెగ చెక్కర్లు కొడుతోంది. ‘‘అబ్బా కొడుకులు భళే ఫొటో దిగారు కదా”అంటూ నెటిజన్లు ఫన్నీగా కామెంట్స్​ చేస్తున్నారు. చాలా అరుదైన మూమెంట్​, వాటే గ్రేట్​ అంటూ ఇంకొంతమంది రీ ట్వీట్​ చేస్తున్నారు.

ఇలాంటి మధు క్షణాలు అనేవి చాలా కొద్దిమందికే దక్కుతాయని, ఎంతైనా వారిద్దరు చాలా అదృష్టవంతులంటున్నారు ఇంకొంతమంది నెటిజన్లు. పిల్లలతో పాటు తల్లిదండ్రులు ఇట్లాంటి అద్భుతమైన డ్యూటీ చేస్తూ.. ఒకే ఫ్రేమ్​లో, వేర్వేరు రైళ్లలో ఉండగా ఫొటో దిగడం అనేది కూడా చాలా డిఫరెంట్​గా ఉందంటున్నారు.  

కాగా, సురేష్ కుమార్ ట్విట్టర్‌లో షేర్ చేసిన ఈ ఫొటో.. కొడుకు ట్రావెల్ టికెట్ ఎగ్జామినర్ (TTE) కాగా, అతని తండ్రి రైల్వేలో గార్డుగా పనిచేస్తున్నారు. తండ్రీకొడుకులు డ్యూటీ సమయంలో అకస్మాత్తుగా ఇలా వేర్వేరు రైళ్లలో కనిపించారు. ఈ క్రమంలో కొడుకుఈ ఫొటోని తీయగా.. అదిప్పుడు నెట్టింట వైరల్గా మారింది.

“తండ్రి రైల్వేలో గార్డు, కొడుకు టీటీ. రెండు రైళ్లు పక్కపక్కనే వెళ్లినప్పుడు సెల్ఫీ దిగడం బాగుంది” అని క్యాప్షన్‌ని యాడ్​ చేశారు. నెటిజన్లు ఈ ఫోటోను ఇష్టపడి పోస్ట్ ను ప్రేమతో షేర్​ చేస్తున్నారు. 60 వేలకు పైగా లైక్స్ తో, ఈ ఫొటో ఇప్పుడు వైరల్‌గా మారింది. తండ్రీకొడుకుల జంట ఎప్పటికీ ఆరాధించే ఫొటో అని చాలా మంది సూచించారు. ఈ పోస్ట్ గురించి మీరు ఏమనుకుంటున్నారో కామెంట్​ రూపంలో తెలియజేయండి?

Advertisement

తాజా వార్తలు

Advertisement