Tuesday, March 26, 2024

టీటీడీ ఓఎస్డీ డాల‌ర్ శేషాద్రి క‌న్నుమూత‌ .. బాధాక‌ర‌మ‌న్న వైవీ సుబ్బారెడ్డి ..

కార్తీక‌దీపోత్స‌వం కార్య‌క్ర‌మంలో పాల్గొనేందుకు వెళ్ళిన శ్రీవారి ఆల‌య ఓఎస్డీ డాల‌ర్ శేషాద్రి హ‌ఠాన్మ‌ర‌ణం చెందారు. తెల్ల‌వారుజామున ఆయ‌న‌కి హార్ట్ ఎటాక్ రావ‌డంతో హాస్ప‌ట‌ల్ కి త‌ర‌లించే లోగా క‌న్నుమూశారు. 1978 నుంచి డాలర్‌ శేషాద్రి శ్రీవారి సేవలో ఉన్నారు. 2007లో రిటైర్‌ అయినా.. శేషాద్రి సేవలు తప్పనిసరికావడంతో ఓఎస్టీగా టీటీడీ కొనసాగించింది. మరణించే చివరి క్షణం వరకు ఆయన స్వామి సేవలో తరించారు. డాలర్ శేషాద్రి మరణం బాధాకరమని టీటీడీ ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. డాలర్ శేషాద్రి మరణం టీటీడీకి తీరని లోటని అదనపు ఈవో ధర్మారెడ్డి అన్నారు. డాల్లర్ శేషాద్రి ధన్యజీవి అని మాజీ సిఎస్‌ ఎల్వీ సుబ్రమణ్యం అన్నారు. ఆయనతో తనకు ప్రత్యేక అనుబంధం ఉందని తెలిపారు. ఈ సంఘ‌ట‌న విశాఖ‌ప‌ట్నంలో జ‌రిగింది. మిగ‌తా వివ‌రాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement