Thursday, April 25, 2024

శ్రీవారి ఆలయ మహాసంప్రోక్షణకు రండి: ఒడిశా సిఎంకు టీటీడీ ఆహ్వానం

 భువనేశ్వర్‌లో టీటీడీ నిర్మించిన వేంకటేశ్వరస్వామి వారి దేవస్ధానం మహాసంప్రోక్షణ కార్యక్రమానికి హాజరు కావాలని టీటీడీ చైర్మన్‌ వైవి సుబ్బారెడ్డి  ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ను ఆహ్వానించారు. శనివారం సాయంత్రం  చైర్మన్ ముఖ్యమంత్రిని ఆయన అధికారిక నివాసంలో కలిసి శ్రీవారి ప్రసాదాలు,ఆహ్వాన పత్రిక అందజేసి శాలువతో సన్మానించారు.

మే 21వ తేదీ నుంచి ఆలయ మహాసంప్రోక్షణకు సంబంధించిన పూజా కార్యక్రమాలు ప్రారంభమవుతాయని సుబ్బారెడ్డి ముఖ్యమంత్రికి తెలిపారు. అలాగే, ఈ నెల 26న విగ్రహ ప్రతిష్ఠ, మహా సంప్రోక్షణ, ఆవాహన ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాలు జరుగుతాయని చైర్మన్ వివరించారు. కాగా, కార్యక్రమానికి హాజరవుతానని సిఎం చెప్పారు.

అంతకుముందు చైర్మన్ వైవి సుబ్బారెడ్డి భువనేశ్వర్ లో ఆలయ నిర్మాణ పనులు, మహాసంప్రోక్షణకు జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. కళ్యాణమండపంలోని గదులకు ఎసి సదుపాయం కల్పించాలని భక్తులు చైర్మన్ కు కోరారు. వెంటనే ఈ ఏర్పాటు చేయాలని చైర్మన్ ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. శ్రీవారి సేవకులతో అక్కడి వసతులు, ఇతర అంశాలపై మాట్లాడి సమాచారం తెలుసుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement