Thursday, April 25, 2024

ఇంకోసారి రిపీట్ ఐతే మర్యాద ఉండదు: ఆర్టీసీ ఎండీ సజ్జనార్

టీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ దూకుడు పెంచారు. ఆర్టీసీని తక్కువ చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఇప్పటికే హెచ్చరించారు. ఇటీవల ఆర్టీసిని తక్కువ చేస్తూ రాపిడో అనే సంస్థ చేసిన యాడ్ విషయమై వివాదం నెలకొన్న విషయం తెలిసిందే. అల్లు అర్జున్, రాపిడో సంస్థ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ డిమాండ్ చేశారు. అంతకుడు సెలెబ్రిటీలు కమర్షియల్ యాడ్ లు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని, డబ్బుల కోసం ప్రభుత్వ రంగ సంస్థల ప్రతిష్టను దిగజార్చే విధంగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చారు. తాజాగా మరోసారి టీఎస్ ఆర్టీసీ బస్సు స్పెషల్ ఏంటో తెలుసా ? అంటూ ఓ స్పెషల్ మీమ్ ను షేర్ చేశారు.

‘రఘువరన్ బిటెక్’ సినిమాలో నిరుద్యోగం గురించి ధనుష్ గుక్క తిప్పుకోకుండా చెప్పే డైలాగును ఆర్టీసీ మీమ్ ని పోస్ట్ చేశారు. అందులో.. ‘’ఏముందిరా మీ ఆర్టీసీలో స్పెషల్ ?” అని అమల పాల్ ప్రశ్నిస్తున్నట్టుగా కన్పించగా.. “నా ఆర్టీసీ బస్ లో స్పెషల్ ఏముందా? 100 రూపాయల టి-24 టికెట్ కొనుక్కుని హైదరాబాద్ మొత్తం తిరుగుతాము. నువ్వు 100 రూపాయల పెట్రోల్ కొట్టుకుని నీ ఆడి కార్ లో హైదరాబాద్ మొత్తం తిరగగలవా ? 200 రూపాయలు పెట్టి స్టూడెంట్ పాస్ తీసి నెల మొత్తం తిరుగుతా. అదే నువ్వు 200 పెట్రోల్ కొట్టించుకుని నీ ఆడి కార్ లో నెల రోజులు కాదు కనీసం ఒక్కరోజైనా తిరగగలవా ? 50 మంది ఫ్రెండ్స్ తో కలిసి ఎంజాయ్ చేసుకుంటూ జర్నీ చేస్తా. నీ కార్ లో కనీసం 10 మందిని అయినా ఎక్కించుకోగలవా ? కారును బుక్ చేసుకోవాలంటే ముందే సెక్యూరిటీ డిపాజిట్ చేయాలి. అదే బస్సుకు అయితే అదేం అక్కర్లేదు. ఇంకోసారి టిఎస్ ఆర్టీసీ గురించి తక్కువ చేసి మాట్లాడితే మర్యాదగా ఉండదు చెప్తున్నా” అని ధనుష్ సమాధానం ఇచ్చినట్టుగా ఉంది. కాగా, సజ్జనార్ చేసిన ట్విట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement