Tuesday, April 16, 2024

పిక‌ప్ వ్యాన్ ని ఢీ కొట్టిన ట్ర‌క్కు.. 11మంది మృతి

ట్ర‌క్కు..పిక‌ప్ వ్యాన్ ని ఢీకొట్టింది.ఈ ప్ర‌మాదంలో 11మంది దుర్మ‌ర‌ణం చెందారు. ఈ ఘ‌ట‌న చత్తీస్‌గఢ్‌లోని బలోడా బజార్-భాతపరా జిల్లాలో చోటు చేసుకుంది. ఈ ప్ర‌మాదంలో మరో 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతులందరూ ఒకే కుటుంబానికి చెందిన వారని పోలీసులు తెలిపారు. . ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులు, మృతదేహాలను ఆసుపత్రికి తరలించారు. బాధితులకు తొలుత సమీపంలోని ఆసుపత్రిలో చికిత్స అందించిన తర్వాత మరింత మెరుగైన చికిత్స కోసం రాయ్‌పూర్‌కు తరలించారు. బాధితులు కుటుంబ వేడుకకు హాజరై వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. పోలీసులు కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement