Friday, April 26, 2024

అర్ధరాత్రి చెట్టును ఢీకొన్న లారీ.. డ్రైవర్ కు తీవ్ర గాయాలు

కరీంనగర్ జిల్లా మానకొండూరు మండల కేంద్రంలోని ప్రధాన రహదారిపై అర్ధరాత్రి రెండు గంటల ప్రాంతంలో ఓ లారీ చెట్టును ఢీకొట్టింది. ఈ ఘటనలో డ్రైవర్ కు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. AP35W9449 నెంబర్ గల లారీ సాగర్ సిమెంట్ బస్తాల లోడుతో కోదాడ నుండి మంచిర్యాలకు వెళ్తుండగా మండల కేంద్రంలో చెట్టుకు ఢీకొట్టింది. దీంతో లారీ ముందు భాగంగా నుజ్జునుజ్జయింది. ఈ ఘటనలో లారీ డ్రైవర్ చిన్నుకు తీవ్రగాయాలు కాగా సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు జిల్లాలోని ప్రధాన ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement